'21/05/2025' సాయంత్రం 6 గంటలకు ప్రారంభం 'వెన్నెల మడుగు' (Vennela Madugu).. మహీధర్ @ShadowMadhuBabupodcast
AUDIOBOOK DETAILS:
-------------------------------------------------------
Novel: 'వెన్నెల మడుగు' (Vennela Madugu)
Genre: Fantasy / Folklore
Author / Writer: Madhu Babu
Published In: Serialised in 'Bala Tejam Children Magazine' 1996, Novel Published in 1997
Published by: Satya Vani Publications
Number Of Pages: 144
Language: Telugu
--------------------------------------------------------
మధుబాబు గారి జానపద నవల : వెన్నెల మడుగు
ప్రవాళ దేశానికి రాజు కీర్తిసేనుడు. మహావీరుడైన కీర్తిసేనుడిని లొంగదీసుకోవడం ఎవరి తరం కాలేదు. అటువంటివారిలో పాంచాలరాజు వీరవర్మ మొదటివాడు. వీరవర్మ శఠగోపుడు అనే కపాలికుడిని ప్రవాళరాజ్యం లోకి ప్రవేశపెట్టి, అతని ద్వారా కీర్తిసేనుడిని చంపించాలని అనుకుంటాడు.
శఠగోపుడు తనను ఆదరించిన కీర్తిసేనుడితో నీకు సంతానం కావాలంటే మహారణ్యం లో ఉన్న అపరాజిత దేవి ఆలయానికి వెళ్లి ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పటంతో కీర్తిసేనుడు ప్రయాణం అవుతాడు. శఠగోపుడి ఉద్దేశ్యం ఆ అడవిలో ప్రవేశించిన వారు వెనక్కు రావడం అసాధ్యం, అక్కడున్న యక్షిణీ భూతాల వల్ల మరణిస్తారు అని. అయితే రాజు తిరిగి వస్తూ యక్షిణి శాపానికి గురి అవుతాడు.
అపరాజిత దేవి దగ్గర వరం పొంది తిరిగి వస్తున్న కీర్తిసేనుడు యక్షిణి శాపానికి గురి అవుతాడు. ఆ శాపం వల్ల కన్న బిడ్డకి దూరం అవుతాడు. యక్షిణి బారినుంచి కీర్తిసేనుడి కొడుకు ప్రకృతి వైపరీత్యం వల్ల యక్షిణి దృష్టికి అందకుండా విరథుడు అనే మాంత్రికుడిచే కాపాడబడుతాడు. ఒంటరిగా ఆశ్రమంలో ఉండే ఆ మాంత్రికుడు కీర్తిసేనుడి కొడుకును చూసుకొనుటకు ఒక స్త్రీ మూర్తిని సృష్టించి, ఆమెకి మాళవిక అని నామకరణం చేస్తాడు. ఆమె ఆ బాలుడిని ప్రేమగా పెంచుతుంటుంది. విరథుడికి శంబూకుడు అనే శత్రువు వుంటాడు. శంబూకుడు విరధుడిని మయోపాయంతో బంధించి పాతాళం వంటి బిల్వంలోకి పంపించేస్తాడు. మాళవిక కీర్తిసేనుడి కొడుకును దూరంగా వేరొక గ్రామానికి తీసుకుని వెళ్లి, పెంచి పెద్ద చేస్తుంది. వారెవరో ఎవరికీ తెలియకుండా అక్కడి గ్రామస్తులతో కలిసిపోయి, వారితో సమానంగా కష్టపడుతూ, ఆ బాలుని పెంచి పెద్దజేస్తుంది. 12 ఏళ్లకే ధైర్య సాహసాలు కలిగిన వాడై, అనుకోకుండా నీలమణిని పొందుతాడు. దాని ద్వారా మొక్కలు, పొదలు, వృక్షాలతో మాట్లాడగలుగుతాడు. వాటి వల్లే తన జన్మ రహస్యం తెలుసుకోగలుగుతాడు. మాళవిక అతనికి విజయుడు అని నామకరణం చేస్తుంది.
అతనుండే వూరు సిరిపురం రాజ్యానికి చెందినట్లు, వారి రాజు ధవళ కాంతుడని, అతని కుమార్తె రాగరంజనిని ఆటవిక నాయకుడు కాలవర్మ దుర్మార్గంతో అపహరించి, వివాహ ప్రయత్నం చేస్తుంటాడని, ఆమెని కాపాడటం అతని కర్తవ్యం అని మొక్కల ద్వారా తెలుసుకుంటాడు విజయుడు. ఎన్నో ఆటంకాలు, ఆవరోధాలను దాటుకుంటూ విజయుడు ఆ రాజకుమారిని కాపాడి, ఆమె రాజ్యానికి పంపుతాడు. ఆ ప్రయాణంలో ఆ రాజకుమారి ప్రవర్తనతో విసుగు చెందుతాడు. పాఠకులకు కూడా ఆమె ప్రవర్తన భరించలేనిదిగా ఆ పాత్రను సృష్టించిన రచయిత, విజయుడు తన రాజ్యం చేరుకుని పరిపాలన చేస్తాడు అంటూ ఆ రాజకుమారినే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో... కీర్తిసేనుడి గురించీ, అతని రాజ్యపాలన గురించీ ప్రస్తావన లేకుండా అంత పొగరుబోతు రాకుమారినే వివాహం ఎందుకు చేసుకున్నాడో తెలియక, ముగింపులో రచయిత హడావుడి పడినట్లు పాఠకులు కొంత అసౌకర్యానికి గురి అవుతారు. కానీ, ఇది ఓవరాల్ గా మధుబాబు గారి మరో చక్కటి జానపద రచన.
#వెన్నెలమడుగు #షాడోమధుబాబు #VennelaMadugu #shadowmadhubabu #madhubabu #teluguaudiobooksyoutube #teluguaudiobook #telugupodcast #fantasynovels #VoiceofSudha #telugukathalu #telugunovels #audiobooks #Fantasystories #folklorestories #freebook #ebookreader #novelreader #podcast #audiobook #telugu #novel #story #serial #kathalu