వీరభద్రోపాసకుడైన ఘటకేంద్రుడేం చెప్పాడు?
పొగమంచు తెరలోకి ప్రవేశించి జవసత్వాలు హరించిపోగా స్పృహను కోల్పోయిన కీర్తిసేన మహారాజుకు తెలివి తెప్పించడానికి, ఆస్థాన విదూషకుడు సౌమ్యుడి సలహా మేరకు వీరభద్రోపాసకుడైన ఘటకేంద్రుడిని పిలిపిస్తారు. ఆయన తన శక్తిని పూరిగా ఉపయోగించి, మహారాజుకు కొద్దిసేపు మాత్రమే తెలివి రప్పించగలిగాడు. ఆ కొద్దిసేపటిలో మహారాజు, పొగమంచుతెరలో తానేం చూశాడు? అసలక్కడ ఏం జరిగింది? వంటి భయంకర నిజాలను బయటపెట్టగలిగాడా? ఎవరికీ అంతుబట్టని ఆ అవాంతరాన్ని అధిగమించడానికి మార్గం ఏమిటి? మధుబాబు గారి అద్భుతమైన ఊహాశక్తిని మరోసారి నిరూపించే ఆ ఘట్టాలను తెలుసుకోవడానికి..
'కాళికాలయం' సిరీస్ లో ఒక్క భాగాన్ని కూడా మిస్ అయ్యే సాహసం చేయకండి..
